Home Page SliderNational

జైపూర్‌లో 100 లాకర్లలో రూ.500 కోట్లు, 50 కిలోల బంగారం

Share with

రాజస్థాన్ బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన  జైపూర్ లోని గణపతి ప్లాజాలో ప్రైవేట్ బ్యాంకులో నల్లడబ్బు ఉంది. 100 లాకర్లు, రూ. 500 కోట్లు, 50 కిలోల బంగారం ఉందంటూ హడావుడి చేస్తున్నారు. వచ్చి లాకర్లు తెరవండి అంటూ పోలీసులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. మీడియాను ఆ బ్యాంకుకు తీసుకెళ్లి హంగామా చేశారు. నవంబర్ 25న ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే రాజస్థాన్‌లోని గెహ్లాత్ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎవ్వరూ ఈయన్ని పట్టించుకోలేదు. కిరోడీ మాటలు సీరియస్‌గా  తీసుకోలేదు. గతంలో కూడా పాపులారిటీ కోసం ఇలాగే  ఓవరాక్షన్ చేసి, అరెస్టయ్యారు.

ఆ లాకర్లలో ఏముంది,ఇది ఎవరిది, అనే విషయాలు కూడా ఆయన చెప్పలేదు.  పేర్లు బయటపెట్టలేము, వారు తప్పించుకోవచ్చంటూ మాటలు మార్చారు.  వచ్చేనెల 25 రాజస్తాన్ ఎన్నికల కోసమే ఈ డబ్బు వాడతారని వాదిస్తున్నారు. ఈయన  2008 వరకూ బీజేపీలో ఉన్నారు. అప్పుడు బీజేపీ నుండి బయటపడి, మళ్లీ 2018లో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి మళ్లీ బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. రాబోయే ఎన్నికలలో  ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.