దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 300 కేసులు కేరళలోనే వెలుగుచూశాయని తెలిపింది. నిన్న దేశంలో 6 కరోనా మరణాలు సంభవించాయి. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్లో ఒకరు మృతి చెందారు. నిన్న తెలంగాణలో 5, ఏపీలో 1 కేసు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసులున్నాయి.