Home Page SliderNational

మధ్యప్రదేశ్‌లో వంతెనపై నుంచి పడిన బస్సు, 15 మంది మృతి

Share with

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ఈరోజు బస్సు వంతెనపై నుంచి పడిపోవడంతో 15 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. 50 మందితో ప్రయాణిస్తున్న బస్సు ఇండోర్‌కు వెళ్తుండగా ఖర్గోన్‌లోని దాసంగా గ్రామంలో వంతెనపై నుంచి కిందపడిందని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. స్థానికుల సహాయంతో అత్యవసర సేవలు అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹ 4 లక్షలు, ‘తీవ్రంగా’ గాయపడిన వారికి ₹ 50,000 మరియు స్వల్పంగా గాయపడిన వారికి ₹ 25,000 చొప్పున పరిహారం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా ముఖ్యమంత్రి చౌహాన్ ప్రభుత్వం భరిస్తుందన్నారు.

ఇక మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.