Home Page SliderInternational

కెనడాలో వృద్ధులతో వెళ్తున్న బస్సు ప్రమాదం -15 మంది మృత్యువాత

Share with

కెనడాలోని మనిటోబ ప్రావిన్స్ అనే ఏరియాలో  ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వృద్ధులతో వెళ్తున్న మినీ బస్సును, ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డుపై వీల్ చైర్లు, వాకర్లు పడి ఉన్నాయి. నైరుతి మనిటోబలోని కార్‌బెర్రీ నగరంలో రెండురోడ్ల ప్రధాన కూడలిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కెనడా చరిత్రలోనే అత్యంత ఘోర రోడ్ ప్రమాదంగా పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ మినిబస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. 15 మంది మరణించగా, 10 మందికి గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ బస్సు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనపై కెనడా ప్రధాని జస్టిస్  ట్రూడో ట్విటర్‌లో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దీని గురించి తెలిసి, తన హృదయం ముక్కలైందని బాధపడ్డారు.