Home Page SliderTelangana

 తెలంగాణాలో ఆషాడ బోనాలకు 15 కోట్లు

Share with

జూన్ 22 నుండి తెలంగాణాలో జరుగబోయే ఆషాడ బోనాలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయిస్తోందని, ఈ బోనాలు గోల్కొండ నుండి ప్రారంభం కాబోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణా సీఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌లతో శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. బోనాల పండుగ  తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర పండుగ కాబట్టి వైభవంగా నిర్వహించాలని కోరారు. జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి ,10న రంగం, 16న ఓల్డ్ సిటీ, 17 న ఊరేగింపు, జూన్ 20 న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తామని తెలియజేసారు.