Home Page SliderNational

బ్రిడ్జిపై నుండి నదిలో పడిన డీసీఎం -12మంది మృతి, పలువురికి గాయాలు

Share with

పెళ్లిబృందంతో వెళ్తున్న డీసీఎం వాహనం ప్రమాదవశాత్తూ నదిలో పడింది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా దుర్సదా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన మీదుగా వెళ్తున్న వాహనం బుహ్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ ప్రమాదం వల్ల పెళ్లిబృందంలోని పలువురు చిన్నారులు నదిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరు  వివాహ వేడుకకు తికమ్గా నుండి గ్వాలియర్ వెళుతున్నారు. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశాల ప్రకారం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్ గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.