విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలోని దక్షిణమధ్య రైల్వే రూట్లో నడిచే పలు రైళ్లను భద్రతా పనుల కారణంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్ళించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17 నుండి 23 వరకూ ఈ ప్రభావం ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. రాజమండ్రి- విశాఖ, కాకినాడ-విశాఖ, విశాఖ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు 18,21,22 వ తేదీలలో ధన్బాద్- అలెప్పీబొకారో ఎక్స్ప్రెస్ను కూడా దారి మళ్లించారు. కింది పట్టికలో రద్దయ్యే, దారిమళ్లించే రైళ్ల వివరాలను చూడవచ్చు.
రద్దు చేయబడే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-64.png)
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-65.png)
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-66.png)